Essence of Thandel: ఈసారి వేట గురితప్పేదేలే..ఇక రాజులమ్మ జాతర మొదలు

Essence of Thandel: ఈసారి వేట గురితప్పేదేలే..ఇక రాజులమ్మ జాతర మొదలు

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా టాలెంటెడ్ దర్శకుడు చందు మొండేటి (Chandu mondeti) కాంబోలో తెరకెక్కుతున్న మూవీ తండేల్(Thandel). పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా..నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్గా నటిస్తోంది.

లేటెస్ట్గా ఎసెన్స్ ఆఫ్ తండేల్ (Essence Of Thandel) అంటూ ఈ గింప్ల్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఒక్క వీడియోతోనే సినిమాలో ఉండే ఇంటెన్స్ ఎమోషన్ తో క‌థ చేప్పేశాడు డైరెక్టర్ చందు మొండేటి.

గుజరాత్‌ లోని సూరత్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. బోటు నడిపే వ్యక్తి బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లగా..అలా సముద్రవేట లో ఉంటూ పాకిస్థాన్‌ కోస్టుగార్డుల చెరలో చిక్కుతాడు. అలా అక్కడి పాకిస్థాన్ జైలు నుంచి..అత‌డు ఎలా బయటపడ్డాడు?

ఏంట్రా దేశభక్తి ఆ? మా నుంచే ఊడిపోయిన ఒక ముక్క..మీకే అంత ఉంటే ..ఆ ముక్కను ముష్టేసిన మాకు ఎంత ఉండాలిరా? అని నాగ చైతన్య చెప్పే డైలాగ్ అదిరిపోయింది. గ్లింప్స్‌ చివర్లో..బుజ్జిత‌ల్లి వ‌చ్చేస్తున్న కదే.. కాస్తా న‌వ్వ‌వే అంటూ చైతూ వాయిస్ తో సముద్రపు అడుగుల అలజడితో సాయి ప‌ల్ల‌వి క‌నిపించ‌డం గ్లింప్స్‌కే హైలెట్‌గా నిలిచింది. ప్రేమ కథ, దేశభక్తి అంశాలతో తెరకెక్కుతున్న తండేల్ చై ఫ్యాన్స్ కు సూపర్ ఎసెన్స్ గ్లింప్స్‌ ఇచ్చేసింది.