అఖిల్ అక్కినేని-జైనాబ్ పెళ్లి: సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన నాగార్జున దంపతులు

అఖిల్ అక్కినేని-జైనాబ్ పెళ్లి:  సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన నాగార్జున దంపతులు

అక్కినేని అఖిల్, తన ప్రియురాలు జైనాబ్ ర‌వ్జీల పెళ్లికి ముహూర్తం ఫిక్స‌యిన‌ట్లు సమాచారం. శుక్రవారం జూన్ 6న ఈ జంట పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు టాలీవుడ్‌లో వార్త‌లు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా నేడు (మే 31న) అక్కినేని నాగార్జున, అమల దంపతులు జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుక సందర్భంగా అటెండ్ అవ్వాలని ఆహ్వానాన్ని అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. అఖిల్, జైనాబ్ ర‌వ్జీలపెళ్లి అన్న‌పూర్ణ స్టూడియోలోనే సింపుల్‌గా జ‌ర‌గ‌బోతున్న‌ట్లు స‌మాచారం. నాగ‌చైత‌న్య‌, శోభితా ధూళిపాళ్ల పెళ్లి కూడా అన్న‌పూర్ణ స్టూడియోలోనే జ‌రిగింది. అఖిల్ పెళ్లి తేదీపై అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  

అయితే, గతేడాది నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హల్ ను హైడ్రా కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తన కుమారుడి పెళ్ళికి ఆహ్వానించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.