తీర్థం పేరిట యాసిడ్ పోసి... 11 మందిని చంపేసిండు

తీర్థం పేరిట యాసిడ్ పోసి... 11 మందిని చంపేసిండు
  • తీర్థం పేరిట యాసిడ్ పోసి 11 మందిని చంపేసిండు
  • గుప్త నిధుల పేరిట మాయమాటలు
  • అడ్వాన్సుగా ప్లాట్లు, జాగాల రిజిస్ట్రేషన్
  • ఏపీ, తెలంగాణ, కర్నాటకలో మర్డర్స్
  • దొంగ బాబా గుట్టు విప్పిన డీఐజీ

నాగర్ కర్నూల్: మాయలు, మంత్రాలు, గుప్తనిధుల ఎరతో 11 మందిని హతమార్చిన సీరియల్ కిల్లర్ రామాటి సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్​కర్నూల్​జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో  జోగులాంబ గద్వాల్ డీఐజీ ఎల్ఎస్ చౌహన్ వివరాలు వెల్లడించారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆకుల పసరు, నాటు వైద్యం, మంత్రాలు నేర్చుకున్న సత్యనారాయణ గుప్త నిధుల ఆశచూపి కొందరిని లోబర్చుకున్నాడు. అడ్వాన్స్ గా డబ్బులు, ప్లాట్లు, భూములు తనపేరిట రిజిస్టర్ చేయించుకున్నాడు. 

తాంత్రిక పూజలు చేయాలని నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకువెళ్లి తీర్థం అంటూ వారి నోట్లో యాసిడ్ పోసి చంపేసేవాడు. ఆనవాళ్లు లేకుండా చేసేవాడు. ఇలా వనపర్తిలో నలుగురిని, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి ప్రాంతాలకు చెందిన నలుగురు, కర్నాటక బలగనూరులో ఒకరు, ఏపీ లోని అనంతపూర్ లో ఒకరు, హైదరాబాద్ కు చెందిన ఒకరిని చంపేశాడు. హైదరాబాద్ లో ఉండే వెంకటేశ్ భార్య ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ జరిపితే సత్యనారాయణ 11 హత్యలు చేసినట్లు తేలిందన్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి తిరిగి పోలీస్ కస్టడికి తీసుకుంటామని తెలిపారు. తదుపరి విచారణలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందని వివరించారు.