గోదావరిఖని, వెలుగు: సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో సంస్థకు చెందిన కవులు, కళాకారులు, రచయితలు, క్రీడాకారులు, జర్నలిస్ట్లు, డాక్టర్లు, అడ్వకేట్లు తదితర రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి హైదరాబాద్ తారా ఆర్ట్స్ అకాడెమీ శనివారం రాత్రి, ఆదివారం రెండు రోజుల పాటు నల్లవజ్రం కీర్తి పురస్కారం, ఉగాది పురస్కారాలను అందజేసింది.
గోదావరిఖని మార్కండేయకాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) ఏసీపీ ప్రతాప్, సినీ సంగీత దర్శకులు, గాయకుడు ఘంటాడి కృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సారధి సలహామండలి సభ్యులు అంతడుపుల నాగరాజు, డ్యాన్సర్ వర్షిణీ, తారా ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సంకె రాజేశ్, తదితరులు హాజరై పురస్కారాలను అందజేశారు.
