బంజారాహిల్స్ ల్యాండ్ కేసులో 58 మందికి రిమాండ్

బంజారాహిల్స్ ల్యాండ్ కేసులో 58 మందికి రిమాండ్

బంజారాహిల్స్ ల్యాండ్ కేసులో 58 మందికి రిమాండ్ విధించింది కోర్టు. రాత్రి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 100 కోట్ల విలువైన భూమిలోకి అక్రమంగా ప్రవేశించారని, అక్కడున్న వారిపై మారణాయుధాలతో  దాడి చేశారని కేసు ఫైల్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. 58 మంది నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. 

నిన్న రాత్రి బంజారాహిల్స్ రోడ్డు నెం.10లో రాయలసీమ ముఠా హల్ చల్ చేసింది.  AP జెమ్స్ అండ్ జువెలర్స్ పార్క్ కు 2005లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. రోడ్డుకు ఆనుకోని మరో అర ఎకరానికి పైగా ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలం తమదేనంటూ టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మనుషులు…. కొద్ది రోజుల క్రితం డెవలప్ మెంట్ పేరుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో ఖాళీ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు 10 వాహనాల్లో కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన 90 మంది మారణాయుధాలతో అక్కడికి చేరుకుని హల్చల్ చేశారు. స్థలంలో అప్పటకే ఉన్న సెక్యూరిటీపై దాడి చేశారు. విషయం తెలుసుకుని స్పాట్ కు చేరుకున్న పోలీసులు 58 మందిని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు TG వెంకటేశ్, ఆయన సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్ పై కేసు నమోదుచేశారు. 

 

మరిన్ని వార్తల కోసం

ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటా

కేంద్రంపై తప్పుడు ప్రచారం కోసమే ధాన్యం రగడ