నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

అనంతపురంలో హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అన్నారు.  ఏపీలో ఉంది చెత్త ప్రభుత్వమని,  రాష్ట్రంలో డ్రగ్స్, ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని ఆరోపణలు  చేశారు.  హిందుపురం జిల్లా గార్లదిన్నేలో బాలయ్య ఈ కామెంట్స్ చేశారు.  నారా లోకేష్ యువగళం పాదయాత్ర కోసం బాలయ్య అక్కడికి వెళ్లారు.  రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలన్నది వైసీపీ కుట్ర అని కూడా మండిపడ్డారు.  జనం అంటే వైసీపీకి లెక్కలేదని,  జగన్ కు పాలన చేతకాదన్నారు.

జనం అంటే జగన్ కు కక్ష అన్న బాలయ్య.. అదోరకం సైకోతత్వమని అన్నారు. తాను సైకాలజీ చదవలేదని, కానీ తానో పెద్ద సైకాలజిస్ట్ అని  చెప్పుకొచ్చారు. టీడీపీ హాయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు జనాలకు ఇవ్వలేదని,  ఇప్పుడు ఇచ్చిన తీసుకోవద్దు అని ప్రజలకు సూచించారు.  టిడ్కో ఇళ్లు కూలిపోయి జనాలు చనిపోతారని అన్నారు.  మెయింటన్స్ లేక ఇళ్లు పాడయ్యాయని బాలయ్య తెలిపారు.