టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో చంపేందుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు నారా లోకేశ్. చంద్రబాబుకు జైల్లో ఏం జరిగినా జగన్ దే బాధ్యత అని అన్నారు. సీఎం సైకో జగన్ చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయించింది.. జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపించారు. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ట్వీట్ చేశారు లోకేశ్.
సైకో జగన్ @ncbn గారిని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు… pic.twitter.com/20a8Hq0Dl9
— Lokesh Nara (@naralokesh) September 21, 2023
జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర జరుగుతోందన్నారు లోకేష్. చంద్రబాబుకి జైలులో భద్రత లేదన్నారు. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడని లోకేశ్ అన్నారు. చంద్రబాబును కూడా ఇలాగే చేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్ దే బాధ్యత అని అన్నారు.