
మాజీ మంత్రి నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశాడు. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ పై, నాయకులపై సోషల్ మీడియా వేదికగా ట్విటర్ లో విసుర్లు విసిరాడు. బడ్జెట్ పై వైసీపీ ప్రభుత్వం కోసిన కోతలకు, కేటాయించిన నిధులకు పొంతనే లేదని ఆయన అన్నారు. ఆ విషయం పక్కనే ఉన్న గౌరవ వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుందని, అందుకే ఆ పార్టీ నేతలే గుర్రుపెట్టి నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ వింటున్న సొంత నేతలే నిద్రపోతుంటే.. ఇక సీఎం గారి హామీలన్నీ గుర్తుంచుకొని, బడ్జెట్ విన్న ప్రజల పరిస్థితి ఏంటో? అని లోకేశ్ ప్రశ్నించాడు.
ఈ రోజు అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో.. వైసీపీ నేత, ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పక్కన ఉండి ఆవలిస్తున్నారు. ఈ దృశ్యాలపై లోకేశ్ ట్విటర్ లో సెటైర్లు వేశారు.
తమ ప్రభుత్వం కోసిన కోతలకు, బడ్జెట్ లో కేటాయించిన నిధులకు పొంతన లేదన్న విషయం పక్కనే ఉన్న గౌరవ వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుంది. సొంత పార్టీ నేతలే గుర్రుపెట్టారంటే @ysjagan గారి హామీలన్నీ గుర్తుంచుకుని, బడ్జెట్ విన్న ప్రజల పరిస్థితి ఏంటో? pic.twitter.com/hLJgjR8bRs
— Lokesh Nara (@naralokesh) July 12, 2019