యాదాద్రి, వెలుగు: పంచాయతీ ఎన్నికలు జరగడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చేశాయి. పంచాయతీల అకౌంట్లలో 2024-–25 ఫైనాన్స్ ఇయర్కు సంబంధించిన15వ ఆర్ధిక సంఘం ఫండ్స్ జమయ్యాయి. యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లోని 427 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం రూ. 7.59 కోట్లు రిలీజ్ చేసింది. అన్టైడ్ కింద వచ్చిన ఈ అమౌంట్లో 10 శాతం పరిపాలన ఖర్చుల కేటాయింపులు చేసుకోవాల్సి ఉంటుంది.
మిగిలిన అమౌంట్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ)లో భాగంగా చేపట్టిన పనుల బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అత్యధికంగా వలిగొండ మండలానికి రూ. 70.85 లక్షలు, రామన్నపేటకు రూ. 62.32 లక్షలు, బీబీనగర్కు రూ. 60.80 లక్షల చొప్పున జమ అయ్యాయి. అతి తక్కువగా మోత్కూరు మండలానికి రూ. 17.20 లక్షలు జమ అయ్యాయి.
