AI ఒక సాధనం మాత్రమే..స్కిల్స్ ఉన్నవారికి ఎటువంటి ముప్పూ లేదు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

AI ఒక సాధనం మాత్రమే..స్కిల్స్ ఉన్నవారికి ఎటువంటి ముప్పూ లేదు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

ప్రముఖ వ్యాపారవేత్త..ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణమూర్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) స్కిల్స్ఉన్న ఎంప్లాయీస్ కి ప్రత్యామ్నాయం కాదు.. ప్రాడక్టివిటీని పెంచేందుకు, సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగపడుతుందన్నారు నారాయణమూర్తి. తన ఉపన్యాసాలను ప్రిపేర్ చేసుకునేందుకు AI వాడుతున్నట్లు చెప్పారు. తన సమయాన్ని ఆదాచేయడమే కాకుండా స్క్రిప్టును మరింత మెరుగు పర్చడంలో  AI కీరోల్ పోషించిందన్నారు నారాయణమూర్తి. 

ALSO READ | బీఈ, బీటెక్ అర్హతతో.. HALలో స్పెషలిస్ట్ ఖాళీలు.. ఈ జాబ్ వస్తే వెరీ లక్కీ!

వ్యాపార దిగ్గజం నారాయణమూర్తి తన ప్రసంగాలను త్వరగా రాసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT ని వినియోగిస్తున్నట్లు చెప్పారు.  గతంలో తన స్క్రిప్టు రాయడానికి చాట్ జీపీటీ వినియోగం తర్వాత సమయం చాలా ఆదా అయిందన్నారు నారాయణమూర్తి. గతంలో ఒక్కో స్క్రిప్టుకు 25 గంటలు పట్టేదని..చాట్ జీపీటీ వాడకంతో ఓ ఐదు గంటల సయమం తగ్గిందన్నారు. 

చాట్ జీపీటీని తనకుమారుడు రోహన్ మూర్తి పరిచయం చేశాడని 78యేళ్ళ టెక్ దిగ్గజం  నారాయణమూర్తి చెప్పారు. మూర్తి తన     ఉపన్యాసాలు, ప్రసంగాలకోసం డ్రాఫ్టులను సిద్దం చేసేందుకు Open AI చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నానని, ఈ టెక్నాలజీ తన రచనా సమయాన్ని గణనీయంగా తగ్గించిందని చెప్పారు నారాయణమూర్తి. 

AI పై నారాయణ మూర్తి అభిప్రాయం.. 

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గతంలో చాలాసార్లు AI వాడకాన్ని సమర్థించారు. ఇది స్కిల్స్ ఉన్న ఎంప్లాయీస్ కి ప్రత్యామ్నయం కాదు.. ఓ డెవలప్ మెంట్ గా అభివర్ణించారు. జనరేటివ్ AI కోడింగ్ వంటి పనులను ఫాస్ట్ గా చేయడంలో, లోపాలను సరిచేయడంలో AI సాయపడుతుందన్నారు. మొత్తంమీద ఇది టెక్ ఇండస్ట్రీలో ప్రాడక్టివిటీని పెంచేందుకు, సమయాన్ని ఆదాచేస్తుందని నమ్ముతున్నారు. 

తెలివి అనేది అవసరాన్ని బాగా నిర్వచించడంలో ఉంది. నా కొడుకు నాకు అదే చెప్పాడు.మీరు సరైన ప్రశ్న అడగకపోతే మీకు సరైన అవుట్‌పుట్ లభించదు .. AI విషయంలో కూడా ఇదే వర్తిస్తుందన్నారు నారాయణమూర్తి. భవిష్యత్తులో ప్రోగ్రామర్లు,ఎనలిస్టులు అవసరాలను నిర్వచించడంలో మరింత తెలివిగా మారతారు.. వారు పెద్ద పెద్ద సమస్యలను ,సంక్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారని చెప్పారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. 

1970లలో బ్యాంకింగ్ రంగంలో కంప్యూటర్ల వాడకంతో AI పెరుగుదలను పోల్చారు నారాయణమూర్తి. మొదట్లో కంప్యూటర్లను మానవులకు పోటీగా చూశారు.. యూనియన్లు వాటిని వ్యతిరేకించాయని అన్నారాయన.  రానురాను అదే యంత్రాలు ప్రాడక్టివిటీని పెంచేందుకు సాయపడ్డాయని, ఉద్యోగులు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లి వారి కుటుంబాలతో ఎక్కువ సమయం గడపడానికి సాయపడుతున్నారు నారాయణమూర్తి.