కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీలో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సబ్ కా సాథ్… సబ్ కా వికాస్ నినాదానికి అమేథీ ఉదాహరణ అన్నారు. అమేథీ ప్రజల మనసులను తాము గెలుచుకున్నామన్నారు. అమేథీ నియోజకవర్గంలోని కోర్బా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో AK 203 రైఫిళ్లు తయారవుతాయని మోడీ చెప్పారు. AK 203 రైఫిల్స్ మేడిన్ అమేథీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు థ్యాంక్స్ చెప్పారు మోడీ. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై సెటైర్లేశారు మోడీ. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల క్రితమే దీన్ని ప్రారంభించాల్సింది..కానీ తమ ప్రభుత్వ హయాంలోనే ఇది నెరవేరిందన్నారు.
PM Modi: Kuch log duniya mein ghomte-ghoomte batate hain 'Made in Ujjain', 'Made in Jaipur', Made in Jaisalmer'…bhashan karte hain. Unke bhashan hi reh jate hain. Yeh Modi hai, ab 'Made in Amethi' AK-203 rifle hogi. pic.twitter.com/UhxSJBgfOY
— ANI UP (@ANINewsUP) March 3, 2019