జగన్ కు బిగ్ షాక్ : వైసీపీకి నరసరావుపేట ఎంపీ రాజీనామా..

జగన్ కు బిగ్ షాక్ : వైసీపీకి నరసరావుపేట ఎంపీ రాజీనామా..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే ఉన్న సమయంలో.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతున్న సమయంలో.. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లోనూ సీటు గ్యారెంటీ అనే వార్తలు వస్తున్న సమయంలో.. ఎంపీ ఈ నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని రోజులుగా నరసరావుపేట ఎంపీ టికెట్ విషయంపై సీఎం జగన్ స్వయంగా చర్చలు జరుపుతున్నారు. 

నరసనరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయులును పోటీకి దించాలనే ఆలోచన చేశారు. సీటు మార్చటంపై అసంతృప్తిగా ఉన్నారు లావు.. వారం పది రోజులుగా నరసరావుపేట ఎంపీ టికెట్ విషయంపై సందిగ్థత నెలకొంది. ఈ పరిణామాల మధ్యనే లావు శ్రీకృష్ణదేవరాయులు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తో భేటీ కావటం విశేషం..

నారా లోకేష్ తో భేటీ తర్వాత.. 24 గంటల్లోనే లావు శ్రీకృష్ణదేవరాయులు పార్టీకి రాజీనామా చేయటం సంచలనంగా మారింది. లావు శ్రీకృష్ణ దేవరాయులు ఈసారి నరసరావుపేట నుంచి టీడీపీ టికెట్ పై బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.