ఈనెల 15 నుంచి గద్వాలలో మోడీ పేరుతో జాతీయ క్రికెట్ టోర్నీ

 ఈనెల 15 నుంచి గద్వాలలో మోడీ పేరుతో జాతీయ క్రికెట్ టోర్నీ
  • ఈనెల 15 నుంచి జాతీయ క్రికెట్ టోర్నీ
  • 20 రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి జట్లు వస్తున్నాయి: డీకే అరుణ


మహబూబ్ నగర్:  ఈనెల 15వ తేదీ నుంచి గద్వాలలో జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరగనున్నట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంగా భాగంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  

ప్రధాని మోడీ పేరుతో కప్ ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ జరగబోతోందని డీకే అరుణ తెలిపారు. దేశంలోని 20 రాష్ట్రాలతో పాటు  విదేశాల నుంచి కూడా టీమ్స్ వస్తాయని డీకే అరుణ వివరించారు.