
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ అన్నపూరణి (Annapoorani). తమిళ హీరో జై(Jai), సత్యరాజ్(Sathyaraj) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాను నీలేష్ కృష్ణ (Neelesh Krishna) తెరకెక్కించారు.
పలు వివాదాల నడుమ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి..ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగానే..పూర్తిగా డిలీట్ చేసింది. కాగా ఆ వెంటనే ఓటీటీ సంస్థ సింప్లీ సౌత్ (Simply South)లో స్ట్రీమింగ్ రావడానికి సిద్దపడింది. కానీ, పలు కారణాల వల్ల స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం..అన్నపూరణి తిరిగి ఓటీటీలోకి రానుంది. దాదాపు రిలీజైన ఏడు నెలల తర్వాత ఇప్పుడీ ఈ మూవీ తిరిగి ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఆగస్టు 9 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ పోస్ట్ చేశారు. ఇండియాలో కాకుండా కేవలం విదేశాల్లో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
Also Read :- ఇలాంటి పాత్ర కోసం ఎదురుచూశా
‘‘అన్నపూరణి ఈజ్ బ్యాక్. భారతదేశాన్ని మినహాయించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ఆడియన్స్ కు ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండనుంది’’ అని వెల్లడించారు. అయితే, ఇక్కడ మన ఇండియాలో మాత్రం రిలీజ్ చేయకపోవడానికి గల కారణాలు ఇంకా వెల్లడించలేదు.
Annapoorani is BACK ???
— Simply South (@SimplySouthApp) August 6, 2024
Worldwide, excluding India — ONLY on Simply South from August 9. pic.twitter.com/rZELVlhLNR
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అభ్యంతరాలు రావడంతో..ఈ సినిమాను బ్యాన్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ఈ సినిమాను స్ట్రీమింగ్ నుండి తొలగించింది నెట్ఫ్లిక్స్ సంస్థ. అయినప్పటికి వివాదం ఆగకపోవడంతో ఓటీటీ సస్ట్రీమింగ్కి నోచుకోలేదు.
ఇక అన్నపూరణి సినిమా విషయానికి వస్తే..ఈ సినిమాలో నయనతార ఒక బ్రాహ్మణ కుంటుంబానికి చెందిన యువతిగా కనిపించారు. ఆమెకు చెఫ్ అవ్వాలనే కోరిక బలంగా ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడుతుంది. ఆ క్రమంలో ఒక ముస్లిం అబ్బాయితో పరిచయం ఏర్పడుతుంది. అలా ఒకసాగారి అన్నపురణిని మాంసం తినేలా ఒప్పిస్తాడు. దానికి ఉదాహరణగా రాముడు కూడా మాసం తినేవాడని చెప్తాడు. ఇదే విషయంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. సినిమాను బ్యాన్ చేయాలంటూ పిటీషన్స్ దాఖలు చేశాయి.