హైదరాబాద్: నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ పెద్ద హిట్స్గా నిలిచిన విషయం విధితమే. ఈ సినిమాకు సంబంధించి గత నెల 9న బీబీ3 పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ బాలయ్య ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఇప్పటివరకు ఇంకా హీరోయిన్ను సెలెక్ట్ చేయలేదు. దీనికి సంబంధించి ఓ కొత్త కబురు వినిపిస్తోంది. బాలయ్య సరసన యాక్ట్ చేసేందుకు అమలా పాల్ పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది.
అమలా పాల్ను ఈమధ్యే సినీ యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. డైరెక్టర్ బోయపాటి అమలాపాల్కు మొత్తం కథను వినిపించాడని తెలుస్తోంది. స్టోరీకి ఇంప్రెస్ అయిన అమల చేయడానికి ఓకే చెప్పిందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే చాన్స్ ఉందని సమాచారం. ఇంతకుముందు ఈ రోల్లో నటించడానికి శ్రియను కూడా చిత్ర బృందం సంప్రదించిందని తెలిసింది. కానీ ఆమె ఈ సినిమాలో నటించడం లేదని స్పష్టమైంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. ఈ ఫిల్మ్లో విలన్గా నటించాలని బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్తో మేకర్స్ చర్చలు జరిపారని తెలిసింది. దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు.