హైదరాబాద్, వెలుగు: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న పోరాటానికి మద్దతుగా సోమవారం ఎస్ఎఫ్ఐ హైదరాబాద్లోని ఎస్వీకే వద్ద 24 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది.ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. నేతలను ముషీరాబాద్ స్టేషన్కు తరలించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు పాల్గొన్నారు.
