
నెక్కొండ, వెలుగు: గిరిజన విద్యార్థి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. వరంగల్జిల్లా నెక్కొండ మండలం లావుడ్యావాగ్యనాయక్ తండాకు చెందిన బొడ నిఖిల్నాయక్ దుగ్గొండి మండలం గిర్నిబావి మహాత్మా జ్యోతిరావుపూలే స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. స్టేట్నుంచి 20 మంది స్టూడెంట్స్ గత నెల 25న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లారు.
నిఖిల్నాయక్ఎంపికై ఎవరెస్ట్ఎక్కి జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ఈనెల9న తిరిగి వస్తున్నట్లు తండ్రి బొడ బీమానాయక్ తెలిపారు. తమ గ్రామానికి నిఖిల్ గుర్తింపు తెచ్చాడని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెస్ట్ ఎక్కేందుకు వెళ్లే ముందు వారు పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క, సెక్రటరీ సైదులు, ప్రిన్సిపాల్ మల్లయ్య కలవగా, స్టూడెంట్స్ను వారు అభినందించారు.