ఎవరెస్ట్​ ఎక్కిన గిరిజన స్టూడెంట్

ఎవరెస్ట్​ ఎక్కిన గిరిజన స్టూడెంట్

నెక్కొండ, వెలుగు: గిరిజన విద్యార్థి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. వరంగల్​జిల్లా నెక్కొండ మండలం లావుడ్యావాగ్యనాయక్ తండాకు చెందిన బొడ నిఖిల్​నాయక్ దుగ్గొండి మండలం గిర్నిబావి మహాత్మా జ్యోతిరావుపూలే స్కూల్​లో 9వ తరగతి చదువుతున్నాడు. స్టేట్​నుంచి 20 మంది స్టూడెంట్స్​ గత నెల 25న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లారు. 

నిఖిల్​నాయక్​ఎంపికై ఎవరెస్ట్​ఎక్కి జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ఈనెల9న తిరిగి వస్తున్నట్లు తండ్రి బొడ బీమానాయక్​ తెలిపారు. తమ గ్రామానికి నిఖిల్​ గుర్తింపు తెచ్చాడని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెస్ట్​ ఎక్కేందుకు వెళ్లే ముందు వారు పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క, సెక్రటరీ సైదులు, ప్రిన్సిపాల్​ మల్లయ్య కలవగా, స్టూడెంట్స్​ను వారు అభినందించారు.