
నెక్కొండ, వెలుగు: పుట్టెడు దు:ఖంలోనూ తమ తల్లి నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామానికి చెందిన ఒంటెల యాకమ్మ(90) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె కొడుకులు పుల్లారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మనుమడు కరుణకర్రెడ్డి యాకమ్మ నేత్రాలను దానం చేయాలని నిర్ణయించారు. తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్, ఎల్వీ ప్రసాద్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల టెక్నీషియన్ లక్షణ్ఆమె కార్నియా సేకరించారు. యాకమ్మ నేత్రదానంతో ఇద్దరు అంధులకు చూపునిచ్చారు.