పుట్టెడు దు:ఖంలోనూ నేత్రదానం..ఆదర్శంగా నిలిచిన యాకమ్మ కుటుంబీకులు

పుట్టెడు దు:ఖంలోనూ నేత్రదానం..ఆదర్శంగా నిలిచిన యాకమ్మ కుటుంబీకులు

నెక్కొండ, వెలుగు: పుట్టెడు దు:ఖంలోనూ తమ తల్లి నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్  జిల్లా నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామానికి చెందిన ఒంటెల యాకమ్మ(90) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె కొడుకులు పుల్లారెడ్డి, శ్రీనివాస్​రెడ్డి, మధుసూదన్​రెడ్డి, మనుమడు కరుణకర్​రెడ్డి యాకమ్మ నేత్రాలను దానం చేయాలని నిర్ణయించారు. తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్​ వరంగల్,​ ఎల్వీ ప్రసాద్​ ప్రాంతీయ నేత్ర వైద్యశాల టెక్నీషియన్​ లక్షణ్​​ఆమె కార్నియా సేకరించారు. యాకమ్మ నేత్రదానంతో ఇద్దరు అంధులకు చూపునిచ్చారు.