పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

మాహబూబాబాద్ జిల్లాలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి స్టేజి వద్ద స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సును అతివేగంగా నడుపుతున్న డ్రైవర్..రామగిరి స్టేజి దగ్గర గల మూల మలుపును గమనించలేదు. దీంతో బస్సు అతివేగంతో  పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉన్నారు. బస్సు రోడ్డు నుంచి పొలంలోకి దూసుకెళ్లడంతో  పిల్లలు భయాందోళనలకు గురయ్యారు. 

ఈ ఘటనలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పిల్లల అరుపులు విని స్థానికులు బస్సు వద్దకు చేరుకున్నారు. చిన్నారులను బస్సులో నుంచి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత పిల్లల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..దర్యాప్తు చేపట్టారు.