సర్కారు బడుల్లో కొత్త అడ్మిషన్లు..  లక్ష దాటినయ్

సర్కారు బడుల్లో కొత్త అడ్మిషన్లు..  లక్ష దాటినయ్

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో కొత్త అడ్మిషన్లు లక్ష దాటాయి. గురువారం నాటికి 1.08లక్షల మంది స్టూడెంట్లు చేరారు. ఈ నెల 3న ప్రారంభమైన బడిబాటలో భాగంగా అడ్మిషన్లు చేపట్టారు. గురువారం ఒక్కరోజే 8,719 మంది స్టూడెంట్లు చేరారు. దీంట్లో ప్రీ ప్రైమరీలో 108మంది చేరగా,  ఒకటో తరగతిలో అంగన్​వాడీ నుంచి 3,975 మంది, ప్రైవేటు స్కూళ్ల నుంచి 508 , నేరుగా 1,292 మంది పిల్లలు బడుల్లో చేరారు. రెండో తరగతి నుంచి టెన్త్ వరకు మరో 2,836 మంది విద్యార్థులు చేరారు.