హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశాఖ కొత్తగా కొనుగోలు చేసిన 466 వాహనాలను ఆగస్ట్ 1న మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు. ఇందులో 204 వాహనాలను 108 అంబులెన్స్లుగా, 228 వాహనాలను అమ్మ ఒడి అంబులెన్స్లుగా, 34 వాహనాలను డెడ్బాడీల తరలింపు వెహికల్స్గా వినియోగించనున్నారు.
కొత్త అంబులెన్స్ల రాకతో జనాలకు వైద్య సేవలు మరింత వేగంగా అందించవచ్చని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ప్రమాదంలో ఉన్నవారికి అత్యవసర సేవలు వెంటనే అందుతాయని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. దవాఖాన నుంచి ఇంటికి, ఇంటి నుంచి దవాఖానకు గర్భిణులు, బాలింతలను ఉచితంగా చేర్చే 102 వాహనాలను మరింత సౌకర్యవంతంగా రూపొందించి అందుబాటులోకి తెస్తున్నామన్నారు.