ఆగస్టు 1న అంబులెన్స్​ల ప్రారంభం

ఆగస్టు 1న అంబులెన్స్​ల ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశాఖ కొత్తగా కొనుగోలు చేసిన 466 వాహనాలను ఆగస్ట్‌  1న మంత్రి హరీశ్‌  రావు ప్రారంభించనున్నారు. ఇందులో 204  వాహనాలను 108 అంబులెన్స్​లుగా, 228 వాహనాలను అమ్మ ఒడి అంబులెన్స్​లుగా, 34 వాహనాలను డెడ్​బాడీల తరలింపు వెహికల్స్​గా వినియోగించనున్నారు. 

కొత్త అంబులెన్స్​ల రాక‌తో జనాలకు వైద్య సేవలు మరింత వేగంగా అందించవచ్చని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ప్రమాదంలో ఉన్నవారికి అత్యవసర సేవలు వెంటనే అందుతాయని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. దవాఖాన నుంచి ఇంటికి, ఇంటి నుంచి దవాఖానకు గర్భిణులు, బాలింతలను ఉచితంగా చేర్చే 102 వాహనాలను మరింత సౌకర్యవంతంగా రూపొందించి అందుబాటులోకి తెస్తున్నామన్నారు.