భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ లో గ్రీవెన్స్ కు గ్రీన్ సిగ్నల్ 

భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ లో గ్రీవెన్స్ కు గ్రీన్ సిగ్నల్ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్​ కార్యక్రమం భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్​లో గత కలెక్టర్​ జితేష్​ వి పాటిల్ నిలిపివేయగా, కొత్తగా వచ్చిన కలెక్టర్ అంకిత్​ గ్రీవెన్స్​నిర్వహణకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. సోమవారం ఉదయం 10.30 కు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆదివారం పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయాలని, ఈ కార్యక్రమానికి ఆఫీసర్లు సకాలంలో అటెండ్​ 
కావాలన్నారు.