శాతవాహన, పాలమూరు లా కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభం

శాతవాహన, పాలమూరు లా కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: శాతవాహన, పాలమూరు యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన కొత్త లా కాలేజీల్లో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఒక్కో కాలేజీలో మూడేండ్ల ఎల్ఎల్ బీ కోర్సు, రెండేండ్ల ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. 

ఒక్కో కాలేజీలో ఎల్ఎల్ బీలో రెండు సెక్షన్లు ఉండగా.. ఒక్కో సెక్షన్ కు 60 చొప్పున సీట్లు, ఎల్ఎల్ఎంలో ఒక్కో సెక్షన్ లో 60 సీట్లు ఉంటాయి. కాగా, లాసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో ఈ రెండు కాలేజీల పేర్లను చేర్చనున్నట్టు అధికారులు ప్రకటించారు. గతేడాది మొత్తం 31 కాలేజీలు ఉండగా, 8,680 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో7,148 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు.