MS Dhoni: కీపింగ్‌కు ధోని గుడ్ బై..! ‘న్యూ రోల్‌’ అంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

MS Dhoni: కీపింగ్‌కు ధోని గుడ్ బై..! ‘న్యూ రోల్‌’ అంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

భారత మాజీ సారథి, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 2022 ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో కెప్టెన్సీ నుంచి తప్పుకొని అందరిని ఆశ్చర్యపరిచిన మహేంద్రుడు, మరోసారి అలాంటి షాక్ ఇవ్వబోతున్నారు. మరో 18 రోజుల్లో అంటే మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్‌ ప్రారంభం కానుండగా.. "న్యూ సీజన్.. న్యూ రోల్.." అంటూ మహేంద్రుడు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ధోని చేసిన ఈ పోస్టు అభిమానులను గందరగోళంలోకి నెడుతోంది.

ఎప్పుడో అమవాస్య, పున్నమి అన్నట్టు సోషల్‌ మీడియాను ఉపయోగించే మహేంద్రుడు ఐపీఎల్‌-17 ఆరంభానికి ముందు ఫేస్‌బుక్‌లో 'న్యూ రోల్‌' అని పోస్ట్‌ పెట్టి తీవ్రమైన చర్చ రేకెత్తించారు. "న్యూ సీజన్‌లో న్యూ రోల్‌ కోసం ఆసక్తికరంగా వేచి చూస్తున్నా. స్టే ట్యూన్డ్‌.." అని మహీ పేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు. దీంతో అతను మరోసారి కెప్టెన్సీ నుంచి తప్పుంటాడా ..! లేదా కీపింగా..! అనేది సస్పెన్స్‌గా మారింది. గత సీజన్‌లో మోకాలి గాయంతో పదే పదే ఇబ్బంది పడ్డ ధోని,ఈసారి కీపింగ్ బాధ్యతలు మరొకరికి అప్పగించనున్నారనేది వస్తున్న వార్తల సారాంశం. ఇవి రెండు కాకుండా, ఆటకు గుడ్ బై చెప్పి మెంటార్‌గా కొనసాగనున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.  మరి ఈ పోస్ట్ వెనుకున్న ధోని ఉద్దేశ్యమేంటో తెలియాలంటే మార్చి 22 దాకా వేచి చూడాల్సిందే.

ఐపీఎల్ 2024 సీఎస్‌కే షెడ్యూల్:

  • మార్చి 22న: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో
  • మార్చి 26న: గుజరాత్ టైటాన్స్‌తో
  • మార్చి 31న: ఢిల్లీ క్యాపిటల్స్‌తో 
  • ఏప్రిల్ 05న: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో