- ఇంగ్లండ్ లోనే 2027 డబ్ల్యూటీసీ ఫైనల్
దుబాయ్ : విమెన్ క్రికెటర్లకు, ఫ్యాన్స్కు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అమ్మాయిల కోసం కొత్తగా విమెన్స్ టీ20 చాంపియన్స్ ట్రోఫీని ప్రవేశపెట్టింది. ఈ టోర్నీ 2027 ఫిబ్రవరిలో జరుగుతుందని శుక్రవారం ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో మెన్స్ చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరిలో పాకిస్తాన్లో జరగనుంది. మరోవైపు 2027 ఎడిషన్ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు కూడా ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ మెగా ఫైనల్ ఇంగ్లండ్లో జరగనుండటం ఇది వరుసగా నాలుగోసారి. 2021 ఫైనల్ సౌతాంప్టన్లో, 2023 ఫైనల్ ది ఓవల్లో నిర్వహించగా.. 2025 ఫైనల్ను లార్డ్స్లో షెడ్యూల్ చేశారు. తాజాగా 2027 ఫైనల్ను కూడా ఇంగ్లండ్ కు కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.