
కరోనా వైరస్సెకండ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకు అన్నిరకాల వేడుకలు రద్దు చేసింది. ముఖ్యంగా…న్యూఇయర్ క్రమంలో డిసెంబరు 31, జనవరి 1న వేడుకలు జరపరాదని స్పష్టం చేసింది. ఆ రెండు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేయనున్నారు. రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంచే వేళలను కూడా తగ్గించనున్నారు.
ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గినా…జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో కరోనా మరోసారి పెరిగే అవకాశం ఉందని కేంద్రం వైద్య సంస్థలు హెచ్చరించిన క్రమంలో రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.