రోహిత్ ,గిల్ సెంచరీలు..భారత్ భారీ స్కోరు

రోహిత్ ,గిల్ సెంచరీలు..భారత్ భారీ స్కోరు

చివరి వన్డేలో టీమిండియా దుమ్ము రేపింది. న్యూజిలాండ్ కు 386 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన  భారత్ 50 ఓవర్లలో 9 ఓవర్లలో 385 పరుగులు సాధించింది. ముఖ్యంగా ఓపెనర్లు శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ అద్భుత ఆరంభాన్నిచ్చారు. కివీస్ బౌలర్లను చితక్కొట్టారు. సిక్సులు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఇదే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ 84 బంతుల్లో సెంచరీ కొట్టగా..శుభ్ మన్ గిల్ కేవలం 72 బాల్స్ లోనే సెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్ కు 212 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే సెంచరీ చేసిన అనంతరం రోహిత్ శర్మ(101) ఔటయ్యాడు. టిక్నర్‌ బౌలింగ్  లో బౌల్డ్ అయ్యాడు. దీంతో  భారత్ 212 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే శుభ్ మన్ గిల్ (112)  కూడా పెవీలియన్ చేరడంతో భారత్ 230 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.

టపా టపా..

రోహిత్ శర్మ, గిల్ ఔటయ్యాక భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రోహిత్ ఔట్ తో క్రీజులోకి వచ్చిన వచ్చిన కోహ్లీ సిక్సుతో మాంచి ఊపుమీదున్నట్లు కనిపించాడు. కానీ 36 పరుగులు చేసి ఔటయ్యాడు.  ఇషాన్ కిషన్ (17) మరోసారి విఫలమయ్యాడు.  ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో 230 పరుగులకు ఒక వికెట్ తో పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా..80 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పయింది. 

హార్దిక్ హాఫ్ సెంచరీ..

ఓ వైపు వికెట్లు పడుతున్నా హార్దిక్ పాండ్యా  సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయాడు. శార్దూల్ ఠాకూర్ (25) సహకారంతో భారత్ స్కోరును 350 దాటించాడు. ఇదే క్రమంలో 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ చేసి జోరు మీదున్న పాండ్యా 379 పరుగుల వద్ద జాకబ్ డఫ్ఫీ బౌలింగ్ లో పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కుల్దీప్ 9 వికెట్ గా నిష్క్రమించడంతో  భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది.