రాష్ట్రంలో కొత్తగా 1,436 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,436 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,436 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,22,111 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం కరోనా బారినపడి ఆరుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1271కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,154 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,98,790గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,050 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 18,279 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శనివారం 41,043 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 38,30,503 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతంగా మరియు రికవరీ రేటు 89.5 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 249, రంగారెడ్డి 110, మేడ్చల్ 105, భద్రాద్రి 77, నల్గొండ 75, ఖమ్మం 78, కరీంనగర్ 76, సిద్ధిపేట్ 67, వరంగల్ అర్బన్ 59 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

భీమా నదికి కర్నాటక నుంచి 8 లక్షల క్యూసెక్కులు విడుదల

మూసివేత దిశగా మంచిర్యాల సిమెంట్ కంపెనీ

కొండచరియలు విరిగిపడి తెలంగాణ జవాను మృతి