తెలంగాణలో మరో 2,058 కరోనా కేసులు

తెలంగాణలో మరో 2,058 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,058 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,60,571 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 55,720 కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 984కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,180 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,29,187గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,400 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 23,534 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. సోమవారం రాష్ట్రంలో 51,247 టెస్టులు చేయగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 22,20,586 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 277, రంగారెడ్డి 143, కరీంనగర్ 135, వరంగల్ అర్బన్ 108, సిద్ధిపేట్ 106, ఖమ్మం 103, మేడ్చల్ 97, నల్గొండ 96, నిజామాబాద్ 84, భద్రాద్రి 75, మహబూబా బాద్ 68, సూర్యపేట్ 62, యాదాద్రి 53, జగిత్యాల 52 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

సుప్రీంకోర్టుకు రూపాయి ఫైన్‌‌ కట్టిన ప్రశాంత్‌ భూషణ్

కారుణ్యం సరే.. లాభాల్లో వాటా ఏది?

తహసీల్దార్ల పవర్స్​పై గందరగోళం