తెలంగాణలో కొత్తగా 2,103 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,103 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,103 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,91,386 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 11 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1127కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,243 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,60,933గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,326 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 23,880 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. మంగళవారం 55,359 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 29,96,001 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా మరియు రికవరీ రేటు 84.08 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 298, కరీంనగర్ 103, రంగారెడ్డి 172, మేడ్చల్ 176, నల్గొండ 141, భద్రాద్రి 102, వరంగల్ అర్బన్ 85, ఖమ్మం 93, సిద్ధిపేట్ 92, మహబూబా బాద్ 66, నిజామాబాద్ 57, సూర్యపేట్ 51, కామారెడ్డి 53, సంగారెడ్డి 63 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

ఓటేయాలంటే కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే

ఇండియాకు గుడ్ బై చెప్పిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్

15 రోజులు పోరాడి ఓడిన మరో నిర్భయ