రాష్ట్రంలో 2,751 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో 2,751 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,751 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,20,166 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 9 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 808కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1675 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 89,350గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,008 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది.

అదేవిధంగా రాష్ట్రంలో 23,049 కేసులు హోంఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. నిన్న ఒక్కరోజే 62,300 టెస్టులు చేయగా వాటిలో 2,751 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12,66,643 టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 432, కరీంనగర్ 192, రంగారెడ్డి 185, నల్గొండ 147, ఖమ్మం 132, మేడ్చల్ 128, నిజామాబాద్ 113, సూర్యపేట్ 111, వరంగల్ అర్బన్ 101, సిద్ధిపేట్ 96, జగిత్యాల 88, మంచిర్యాల్ 86, మహబూబా బాద్ 75, భద్రాద్రి 72, కామారెడ్డి 65, మహబూబ్ నగర్ 64, వనపర్తి 63, యాదాద్రి 58, నాగర్ కర్నూల్ 54 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

టిక్‌టాక్ కోసం మైక్రోసాఫ్ట్-వాల్‌మార్ట్ జోడీ

బార్డర్‌‌‌‌‌‌‌‌లో 5జీ నెట్ వర్క్ సిద్ధం చేస్తోన్న చైనా

కరోనా నివారణకు ఈ దూరం చాలదట