రాష్ట్రంలో కొత్తగా 952 కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో కొత్తగా 952 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 952 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,58,828 కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం కరోనా బారినపడి ముగ్గురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,410కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,602 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,43,686గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,732 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 11,313 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. సోమవారం 38,245 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 49,29,974 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 94.14 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 150, మేడ్చల్ 77, భద్రాది 71, రంగారెడ్డి 68, నల్గొండ 45, వరంగల్ అర్బన్ 44, ఖమ్మం 41, కరీంనగర్ 35, మంచిర్యాల్ 33, సూర్యపేట్ 32 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

సోన్‌సూద్‌కు అరుదైన గౌరవం అందించిన ఆయన సొంతరాష్ట్రం

తప్పుడు వార్తలపై పోరాటానికి 1.15 మిలియన్ డాలర్లు

అమెరికాలో 10 లక్షలకు పైగా పిల్లలకు కరోనా