అమ్మకు బాగోలేదని తీసుకెళ్లి.. 3 నెలల క్రితం పెళ్లయిన యువతిపై రేప్

అమ్మకు బాగోలేదని తీసుకెళ్లి.. 3 నెలల క్రితం పెళ్లయిన యువతిపై రేప్

మూడు నెలల క్రితం పెళ్లి జరిగి అత్తారింట్లో సంతోషంగా ఉన్న 18 ఏళ్ల యువతిపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పక్కా స్కెచ్ వేసుకుని మరీ వెళ్లి.. ఆమె తల్లికి ఆరోగ్య బాగోలేదని చెప్పి తీసుకెళ్లి తన పొలంలోని ఓ రూమ్‌లో బంధించి 5 రోజులు పాటు అత్యాచారం చేశాడు. అత్తింటి వాళ్లు ఆమె పుట్టింటికి వెళ్లాక గానీ విషయం బయటకు రాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో ఈ ఘోరం జరిగింది.

18ఏళ్ల యువతి మూడు నెలల క్రితం పెళ్లి చేసుకుని అత్తింటిలో సంతోషంగా ఉంటోంది. అయితే ఆమె స్వగ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లికి ముందు నుంచే ఆ యువతిపై దుర్బుద్ధితో ఉన్నాడు. కడుపులో దాచుకున్న కుట్రను ఆలస్యంగా అమలు చేశాడు. పక్కా స్కెచ్ వేసుకుని గతవారంలో ఆమె భర్త ఊరికి వెళ్లాడు. ఆమె తల్లికి ఆరోగ్యం బాగోలేదని, వెంటనే ఇంటికి తీసుకునిరమ్మని పంపారంటూ అత్తింటి వారిని నమ్మించాడు. అతడి దురాలోచన తెలియక వాళ్లు ఆమెను ఆ దుర్మార్గుడి వెంట పంపారు. అతడు తన పొలంలోని ఓ రూమ్‌లో ఆమెను బంధించి ఐదు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆమె తల్లికి ఎలా ఉందో పరామర్శిద్దామని అత్తింటి వాళ్లు బుధవారం వెళ్లడంతో వారి కోడలు అక్కడికి చేరలేదని తెలిసింది. దీంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల ఇంటికి వచ్చిన వ్యక్తి గుర్తులు చెప్పిన దాని ఆధారంగా పోలీసులు నిందితుడిని ఆ గ్రామానికి చెందిన విశాల్ సరోజ్‌గా గుర్తించారు. గురవారం నాడు ఆమెను కాపాడిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఆమెను వైద్య పరీక్షలకు పంపామని పోలీసులు తెలిపారు.