
విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు.. రూ. 30 వేలు, ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. దీంతో శ్రీనివాస్ రేపు సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలకానున్నాడు.