పుల్వామాలో ఎన్ఐఏ సోదాలు

పుల్వామాలో ఎన్ఐఏ సోదాలు

జమ్ముకశ్మీర్ లో టెర్రరిస్టుల ఫండింగ్ లింక్ ను తెగ్గొట్టేందుకు NIA మరింత దూకుడు పెంచింది. పాకిస్థాన్ సంస్థలతో ముడిపడి ఉన్న ఉగ్రవాదల ఫిండ్ కేసులపై ఇప్పటికే సౌత్ కశ్మీర్ లో NIA ముమ్మరంగా సోదాలు జరిపింది.  అటు షోపియాన్, కుల్గామ్ లలో టెర్రర్ ఫండింగ్ తో సంబంధం ఉన్న గ్రౌండ్ వర్కర్లపై ఆరాతీసిన NIA విస్తృంతగా తనిఖీలు చేపట్టింది. 

తాజాగా పుల్వామాలోనూ సోదాలు జరుపుతోంది. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రసంస్థలకు నిధులపై  NIA ఆరా తీస్తోంది. ఇప్పటికే పలువురు అనుమానితులు అదుపులోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు..నిధుల ప్రవాహంపై కూపీలాగుతున్నారు. NIA సోదాలు జరుపుతున్న ప్రదేశంలో జేకే పోలీసులతో కలిసి పారమిలటరీ బలగాలు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.