ప్రీతి ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు: నిమ్స్ వైద్యులు

ప్రీతి ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు: నిమ్స్ వైద్యులు

మెడికో విద్యార్థిని ప్రీతి నిమ్స్ లో చికిత్స పొందుతోంది. అయితే ఆమె ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని నిమ్స్ వైద్యులు వెల్లడించారు. గత 72 గంటలుగా వెంటిలేటర్, ఎక్మోపైనే ప్రితీకి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రీతికి ఈసీజీ చేయనున్నట్లు చెప్పారు. సాయంత్రంలోగా ఈ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రీతి బ్రెయిన్ యాక్టివిటీ గురించి తెలుసుకునేందుకే ఈ టెస్ట్ చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

ప్రీతి ఆరోగ్యంగా ఉండాలని నిమ్స్ వైద్యులు ఆకాంక్షించారు. ప్రితీని కాపాడేందుకు తాము శ్రమిస్తున్నామని చెప్పారు. ఆమె ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు బులిటెన్ విడుదల చేస్తున్నామని... సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని డాక్టర్లు కోరారు. నిమ్స్ బులిటెన్ రూపంలో విడుదల చేస్తున్న సమాచారం మాత్రమే సరైందని.. దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని వైద్యులు సూచించారు. 

మరోవైపు ప్రీతిని పరామర్శించేందుకు రాజకీయ నేతలు నిమ్స్ కు చేరుకుంటున్నారు. అటు ప్రీతి కండీషన్ గురించి తమకు నిజం చెప్పాలని ఆమె  కుటుంబసభ్యులు వైద్యులను వేడుకుంటున్నారు. ప్రితీని ఎలాగైనా  బతికించాలని తండ్రి నాగేందర్ కోరుతున్నారు.