యూపీలో టెంపోను ఢీకొట్టిన ట్యాంకర్.. తొమ్మిది మంది మృతి

యూపీలో టెంపోను ఢీకొట్టిన ట్యాంకర్.. తొమ్మిది మంది మృతి

ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌గఢ్ : యూపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడి, టెంపో వ్యాన్‌‌‌‌ను ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్​లో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. జిల్లా కేంద్రానికి 15 కిలో మీటర్ల దూరంలో లీలాపూర్ ఏరియాలో లక్నో – -వారణాసి హైవేపై సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నట్లు ఆ జిల్లా ఎస్పీ రోహిత్ మిశ్రా ప్రకటించారు. వ్యాన్‌‌‌‌లో ఉన్న మిగతా ప్రయాణికులను స్థానికులు రక్షించారని ఆయన తెలిపారు.

విషయం తెలిసిన వెంటనే పోలీసు టీం స్పాట్​కు చేరుకుని గాయపడిన ఏడుగురిని ప్రతాప్‌‌‌‌గఢ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే, వారి పరిస్థితి సీరియస్​గా ఉండడంతో  డాక్టర్లు ప్రయాగ్‌‌‌‌రాజ్ ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ఎన్ హాస్పిటల్​కు రిఫర్ చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, మృతులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం తరలించామని, కేసు ఫైల్​చేసి ఎంక్వైరీ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.