రుణమాఫీతో రైతుల కష్టాలు దూరం: మంత్రి నిరంజన్​రెడ్డి

రుణమాఫీతో రైతుల కష్టాలు దూరం: మంత్రి నిరంజన్​రెడ్డి

పెబ్బేరు, వెలుగు: రూ. లక్ష వరకు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించడంతో రైతుల కష్టాలు దూరమవుతాయని మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణానికి వచ్చిన ఆయన సుభాష్​చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి గజమాల వేసి తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.

సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పట్టణానికి పలువురు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మున్సిపల్​ చైర్​పర్సన్​ కరుణశ్రీ, వైస్​చైర్మన్​ కర్రె స్వామి, బుచ్చారెడ్డి, దిలీప్ కుమార్​ రెడ్డి, వనం రాములు, కోదండ రామిరెడ్డి, ప్రమోద్​కుమార్​రెడ్డి, సాయినాథ్, నరేశ్​ పాల్గొన్నారు.