
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్(టీఈఏ) స్టేట్ ప్రెసిడెంట్గా జి.నిర్మల ఎన్నికయ్యారు. ఆదివారం బషీర్ బాగ్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఇప్పటివ రకు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న చిలగాని సంపత్ కుమార్ స్వామి వ్యక్తిగత కారణాలతో ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్తగా ఎన్నికలు నిర్వహించారు.
రాష్ట్ర అధ్యక్షురాలిగా జి.నిర్మల(హైదరాబాద్), సెక్రటరీ జనరల్గా యాకుబ్ పాషా(మంచిర్యాల), ట్రెజరర్గా జి.ఆనందం(హైదరాబాద్) ఎన్నికయ్యారు. సంపత్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని కొత్త కార్యవర్గానికి సూచించారు. అనంతరం నూతన అధ్యక్షురాలు నిర్మల మాట్లాడారు. తనకు బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. జీవో 317 బాధితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, స్పౌజ్ బదిలీలు చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు పనిచేసేలా చూడాలన్నారు. పి.పురుషోత్తం, గడ్డం బాలస్వామి, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.