
పారిస్ పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ ఎస్ఎల్ 3 విభాగంలో భారత్ గోల్డ్ మెడల్ గెలిచింది. సోమవారం (సెప్టెంబర్ 2) పారిస్లోని లా చాపెల్లె ఎరీనా కోర్ట్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నితేష్ కుమార్ కుమార్ గెలిచి భారత్ కు పసిడి పతకాన్ని అందించాడు. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్కు చెందిన డేనియల్ బెథెల్ను 21-14, 18-21,21-12 తేడాతో గెలిచి చరిత్ర సృష్టించాడు. ఇద్దరు పారా షట్లర్ల మధ్య జరిగిన చివరి 10 మ్యాచ్ ల్లో బెథెల్పై నితేష్కి ఇదే తొలి విజయం కావడం విశేషం.
గంట 20 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో తొలి గేమ్ ను నితేష్ 21-14 తేడాతో అలవోకగా నెగ్గాడు. రెండో సెట్ లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతి ఘటన ఎదురైంది. కీలక దశలో తప్పిదాలు చేస్తూ 18-21 తేడాతో రెండో గేమ్ ను చేజార్చుకున్నాడు. నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో మొదటి నుంచి పుజుకున్న నితేష్ 21-12 తేడాతో గేమ్ తో పాటు.. మ్యాచ్ ను.. గోల్డ్ మెడల్ ను గెలుచుకున్నాడు. రాజస్థాన్లో జన్మించిన నితేష్.. ఐఐటీ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం హర్యానాలో నివసిస్తున్నాడు. 2009లో జరిగిన రైలు ప్రమాదం జరగడంతో తన కాలును కోల్పోయాడు.
🇮🇳🥇 NITESH KUMAR DOES IT! He brings home the gold in Men's Singles SL3.
— The Bharat Army (@thebharatarmy) September 2, 2024
🥳 Congratulations, champ!
📷 Pics belong to the respective owners • #NiteshKumar #Badminton #ParaBadminton #Paris2024 #Paralympics #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/rfjrx4nnGe