
- ఎన్నికల సంఘానికి కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లేఖ
లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీచేసిన నిజామాబాద్ నియోజకవర్గం కంట్రీ బుక్ఆఫ్వరల్డ్ రికార్డ్లకు ఎక్కింది. ఈమేరకు కంట్రీ బుక్ నిర్వాహాకుల నుంచి అధికారిక లెటర్ అందినట్లు ఈసీ, ఎంపీ ధర్మపురి అర్వింద్చెప్పారు. త్వరలో ఈ లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపించనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ సీటుకు 185 మంది పోటీ చేశారు.
దీంతో 1788 పోలింగ్ స్టేషన్లలో, 26,820 బ్యాలెట్ యూనిట్లను, 2 వేల కంట్రోల్ యూనిట్లు, 2 వేల వీవీ ప్యాట్లను ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో 2 వేల మంది సిబ్బంది, 600 మంది ఇంజనీర్లు పాల్గొన్నారని, ఫలితాల కౌంటింగ్కు 15 హాళ్లలో 149 టేబుల్స్ ఏర్పాటుచేసినట్లు తెలిపింది.