నిజామాబాద్ ​ఎమ్మెల్సీ పోలింగ్​ ఇయ్యాల్నే

నిజామాబాద్ ​ఎమ్మెల్సీ పోలింగ్​ ఇయ్యాల్నే

నిజామాబాద్‌‌ లోకల్‌‌బాడీ ​ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ నేడు

మొత్తం ఓటర్లు 824  మంది.. 50 సెంటర్ల ఏర్పాటు

నిజామాబాద్‌‌, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్‌‌ లోకల్‌‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా రెడీ అయ్యింది. శుక్రవారం ఉదయం 9  గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌‌ జరుగనుంది.  నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో 50 పోలింగ్​సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండు జిల్లాలకు చెందిన 824 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ మెంబర్లు, నిజామాబాద్​సిటీ కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. గురువారం సాయంత్రమే సిబ్బంది పోలింగ్‌‌ సామగ్రితో వారికి కేటాయించిన సెంటర్లకు చేరుకున్నారు. కరోనా ప్రొటోకాల్​కు అనుగుణంగా ఆఫీసర్లు సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బందికి శానిటైజర్‌‌‌‌, ఫేస్‌‌షీల్డ్‌‌లు అందజేశారు. ఎలక్షన్‌‌ అబ్జర్వర్‌‌‌‌ వీరబ్రహ్మయ్య, కలెక్టర్‌‌‌‌ నారాయణరెడ్డి గురువారం డిస్ట్రిబ్యూషన్‌‌ సెంటర్‌‌‌‌ను పరిశీలించి, ప్రిసైడింగ్‌‌ ఆఫీసర్లకు సూచనలు చేశారు. ఓటర్లలో 24 మందికి కరోనా పాజిటివ్​ కన్ఫర్మ్​అయినట్టు సమాచారం. వీరు ఓటు వేసేందుకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. ముందుగా అప్లయ్​ చేసుకున్నవారు పోస్టల్​ బాలెట్ వాడుకోవచ్చు. లేదంటే సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పీపీఈ కిట్లు వేసుకుని వచ్చి పోలింగ్​సెంటర్​లో ఓటు వేయవచ్చు. పేషెంట్లకు సొంత వెహికిల్‌‌ లేకపోతే అంబులెన్స్‌‌ ఫెసిలిటీ కల్పిస్తామని ఆఫీసర్లు చెప్పారు. నిజామాబాద్​ లోకల్​బాడీ ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్​ భూపతిరెడ్డి డిస్​క్వాలిఫై కావడంతో ఈ బై ఎలక్షన్​ జరుగుతోంది. ఫిబ్రవరి 2022 వరకు పదవీకాలం ఉన్న ఈ పోస్టు కోసం టీఆర్ఎస్​ నుంచి మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్​ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీ పడుతున్నారు.

ప్రతి పోలింగ్ స్టేషన్‍కు 4  పీపీఈ కిట్లు

ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పేపర్‍తోనే జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. పోలింగ్ స్టేషన్‍లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతో మాత్రమే బ్యాలెట్‍ పేపర్‍పై ఓటు వేయాలని, వెంట తెచ్చుకున్న ఇతర పెన్నుతో  ఓటు వేస్తే ఆ ఓటు చెల్లదని పేర్కొన్నారు. ఎలక్షన్‌‌ కమిషన్‌‌ కరోనా పేషెంట్లకు కూడా ఓటు వేసే అవకాశం ఇవ్వడంతో ప్రతి పోలింగ్‌‌ స్టేషన్‌‌కు 4 పీపీఈ కిట్లు, ఒక్కో పోలింగ్‌‌ స్టేషన్‌‌కు 10 శానిటైజర్‌‌‌‌ బాటిళ్లు ఇచ్చారు. పోలింగ్‌‌ సిబ్బంది మాస్క్‌‌, గ్లౌజులు, ఫేస్‌‌ షీల్డ్‌‌ తప్పనిసరి వాడాలని కలెక్టర్‌‌‌‌ చెప్పారు.

For More News..

బీజేపీ కార్పొరేటర్ కు టీఆర్ఎస్ ఆఫర్‌​