కాసేపట్లో కన్యాదానం.. ఇంతలోనే విషాదం

కాసేపట్లో కన్యాదానం.. ఇంతలోనే విషాదం

నిజామాబాద్ జిల్లా నవిపేట్ లో దారుణం జరిగింది. మరి కొద్ది గంటల్లో పెళ్లి అనగా.. పెళ్లి కూతురు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి కొడుకు వేధింపులు తట్టుకోకే  సూసైడ్  చేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

నవిపేట్ కు చెందిన ర్యాగల్ల ప్రభాకర్ కూతురు రవళిని..అదే జిల్లాకు చెందిన సంతోష్ అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఇవాళ మధ్యాహ్నం పెళ్లి ఉండగా.. తెల్లవారుజామును రవళి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలని పెళ్లి కొడుకు సంతోష్ వేధిస్తున్నాడని రవళి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంతోష్ వేధింపులు తట్టుకోలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంతోష్, అతని కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.