రాయికల్, వెలుగు: యువత ఉద్యోగం రాలేదని బాధపడొద్దని, టెక్నిషీయన్ కోర్సులు పూర్తి చేసి సైంటిస్టులుగా ఎదగవచ్చని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు సూచించారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని జీయర్ఎడ్యుకేషనల్ట్రస్టులో జీఎంఆర్ వరలక్ష్మి, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్తంగా యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది.
ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన యువతకు శుక్రవారం ధ్రువీకరణ పత్రాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పెడదారి పట్టకుండా ఉపాధి రంగాలను ఎంచుకోవాలన్నారు. నిరుద్యోగ యువతకు హాస్టల్ కోసం ఎమ్మెల్యే రూ.30లక్షల మంజూరుకు హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు.
ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రచారక్ లింగం శ్రీధర్జీ, మున్సిపల్ చైర్పర్సన్ కట్కం రవీందర్, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఇన్చార్జి ఏఎం రాజురెడ్డి, ప్రతిమ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్గీతారెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు.

