కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక ఎంపీ సీట్లను గెలవాలని, లోక్సభ అభ్యర్థుల ఎంపిక కోసం రాహుల్ కొత్త ఫార్మలాను తెరపైకి తెచ్చారు. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే లోక్సభకు పోటీ చేయడానికి ఎట్టీ పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. అంతేకాక కొత్తవారికి, నిమ్నకులాల వారికి పోటీ చేసేందుకు ఈసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇక మూడోది… రాజ్యసభ ఎంపీలుగా కొనసాగతోన్న వారికి కూడా ఈసారి లోక్సభ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకూడదని కోర్ కమిటీ సభ్యులకు తేల్చిచెప్పారు. ఎమ్మెల్యేలుగా గెలిచిపోయి, పార్లమెంట్ రాజకీయాలపై కన్నేసిన వారికీ, ఆయా నేతల బంధువులకు కూడా ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లు ఇవ్వరాదని అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.