మందుల ధరలు పెరగబోవన్న కేంద్రం

మందుల ధరలు పెరగబోవన్న కేంద్రం

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం అత్యవసర మందుల ధరలను పెంచబోమని కేంద్ర రసాయనాలు,  ఎరువుల శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయా గురువారం ప్రకటించారు.  నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఏటా టోకు ధరల సూచీ ఆధారంగా షెడ్యూల్ చేసిన మందుల  ధరలను సవరిస్తుంటుందని మంత్రి చెప్పారు.

ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ధరల పెరుగుదల ఉంటుందని, తగ్గినప్పుడు ధరలు తగ్గుతాయని మంత్రి చెప్పారు. ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం పెరగలేదు కాబట్టి ధరలను పెంచబోవడం లేదని మాండవియా స్పష్టం చేశారు.