సుప్రీంలో హిందూ మహాసభ రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ : రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హిందూ మహాసభ సోమవారం రివ్యూ పిటిషన్ వేసింది. అయోధ్యలోని మసీదు నిర్మాణానికి వీలుగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై హిందూమహాసభ సుప్రీంకోర్ట్లో రివ్యూ పిటిషన్ ఫైల్ చేసింది. 5 ఎకరాలను ముస్లింలకు ఇవ్వడంలో ఎలాంటి కారణం కనిపించడంలేదని హిందూమహాసభ లాయర్ విష్ణుజైన్ చెప్పారు.