అయోధ్యలో మసీదుకు ఐదెకరాలు ఇవ్వొద్దు

అయోధ్యలో మసీదుకు ఐదెకరాలు ఇవ్వొద్దు

సుప్రీంలో హిందూ మహాసభ రివ్యూ పిటిషన్

న్యూఢిల్లీ :  రామజన్మభూమి-బాబ్రీ మసీదు  కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హిందూ మహాసభ సోమవారం రివ్యూ పిటిషన్ వేసింది. అయోధ్యలోని మసీదు నిర్మాణానికి వీలుగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని  నవంబర్​ 9న సుప్రీంకోర్టు  తీర్పు  చెప్పింది. దీనిపై హిందూమహాసభ  సుప్రీంకోర్ట్​లో రివ్యూ పిటిషన్ ఫైల్​ చేసింది. 5 ఎకరాలను ముస్లింలకు ఇవ్వడంలో ఎలాంటి  కారణం కనిపించడంలేదని  హిందూమహాసభ  లాయర్​ విష్ణుజైన్ చెప్పారు.

No need to give 5-acre plot to Muslims: Hindu Mahasabha to file review petition against Ayodhya verdict