
- స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఏటా ఒడిశాలో ఎంతో వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథ యాత్రకు ఈ సారి బ్రేక్ పడింది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో జగన్నాథ రథయాత్రను నిలిపేయాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహించడం కరెక్ట్ కాదని చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే అన్నారు. “ ఈ పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహిస్తే పూరీ జగన్నాథుడు మనల్ని క్షమించరు” అని ఆయన కామెంట్ చేశారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని రతయాత్రను నిలిపేస్తున్నట్లు అన్నారు. ఏర్పాట్లను కూడా నిలిపేయాలని ఆదేశించారు. జగన్నాథ యాత్రను ఒడిశాలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. లెక్క ప్రకారం ఈ నెల 23న రథయాత్ర జరగాల్సి ఉంది.