ఎంఐఎం అభ్యర్థి మీర్జా రెహమత్ బేగ్ నామినేషన్

ఎంఐఎం అభ్యర్థి మీర్జా రెహమత్ బేగ్ నామినేషన్

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థి మీర్జా రెహమత్ బేగ్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో  మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన అసదుద్దీన్ ఓవైసీకి మీర్జా రెహమత్ బేగ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. తాను చిన్న కార్యకర్త నుండి ఎంఐఎంలో  పనిచేస్తున్నానన్నారు. తన కృషిని గుర్తించి ఇంత పెద్ద పదవి ఇవ్వడం బాధ్యతగా ఫీల్ అవుతున్నానని రహమత్ బేగ్ హర్షం వ్యక్తం చేశారు.