నామినేషన్లకు ఇవాళే లాస్ట్ డేట్

నామినేషన్లకు ఇవాళే లాస్ట్ డేట్

తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు  ఏప్రిల్ 25(ఇవాళ్టి) తో  నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. 17 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటివరకు మొత్తం 478 మంది అభ్యర్థులు 554 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 

ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు డెడ్ లైన్ ఉండగా.. ఏప్రిల్ 26న  నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు రానున్నాయి.